డెహ్రాడూన్ నుండి ముంబై ఆసుపత్రికి రిషబ్ పంత్

-

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి డెహ్రాడూన్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ఆసుపత్రికి తరలించనున్నారు. బిసిసిఐ ప్యానల్ వైద్యులు రిషబ్ పంత్ వైద్య రిపోర్టులను పరిశీలించి.. తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

పంత్ కు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం డెహ్రాడూన్ నుండి ముంబైలోని కోకిలబెన్ అంబానీ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు స్పెషల్ గా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు చికిత్సతో పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు అన్నది తాజా సమాచారం. ఈ విషయంలోనే అతడికి మెరుగైన వైద్యం అందించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది. దీంతో పంత్ ఫ్యాన్స్ బిసిసిఐకి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news