త్వరలోనే యాదాద్రి పేరు మారుస్తాం : ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సంచలన వ్యాఖ్యలు త్వరలోనే యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తాజాగా స్పష్టం చేశారు.శుక్రవారం ఆలయంలో టెంకాయ కొట్టే స్థలాన్ని ప్రారంభించారు.

ఆలయాన్ని దర్శించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులకు నిద్ర చేసే అవకాశాన్ని కల్పిస్తాం అని తెలిపారు. ఆలయ పూజారుల కోసం మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల్ని ఏర్పాటు చేయనున్నాం’ అని పేర్కొన్నారు.పూర్వం నుంచి ఈ పుణ్య క్షేత్రం పేరు మార్చడం సరికాదని ఆయన అన్నారు. కాగా, గత కెసిఆర్ ప్రభుత్వం యాదగిరి గుట్టను యాదాద్రిగా, భద్రాచలం క్షేత్రాన్ని భద్రాద్రిగా మార్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news