వచ్చే ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తాము :ఎన్సీపీ అధినేత అజిత్ పవార్

-

ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహాయుతి కూటమిలో చర్చనీయాంశంగా మారాయి.అయితే, ఆదివారం అజిత్ పవార్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో తన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని తెలిపారు. “ఎన్సీపీ లోక్‌సభ ఎన్నికలలో మహాయుతి మిత్రపక్షాలతో కలిసి పోరాడింది. పార్టీ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిత్రపక్షాలతో కలిసి పోరాడుతుంది అని అన్నారు. అయితే, మేము పౌర మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తాము,” అని అన్నారు.

ఇటీవల ఎన్సీపీకి పట్టున్న పింప్రి-చించ్వాడ్ లోని అజిత్ పవార్ వర్గం నుంచి పలువురు నేతలు శరద్ పవార్ వర్గంలోకి మా రారు.ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్సీపీ గెలుపు కోసం కేవలం అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా స్థానిక, పౌర సంస్థల ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు.జూలై 2023లో శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ బయటకు వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news