పొరుగు రాష్ట్ర పోలీసులు చెబుతుంటే ముఖ్యమంత్రికి ఏమి అనిపించడం లేదా? చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఏ గంజాయి కేసుకైనా మూలాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఉండటం జగన్ పాలనా దౌర్భాగ్యం అని చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలోని గంజాయి మాఫియా పొరుగు రాష్ట్రాలనూ ప్రమాదంలోకి నెట్టేసింది.జగిత్యాలలో గంజాయి విక్రయిస్తున్న ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి సరఫరా కావడం ఆందోళన కలిగిస్తోంది అని అన్నారు.మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెబుతుంటే ఈ సీఎంకి సిగ్గుగా అనిపించడం లేదా?’ అని చంద్రబాబు నాయుడు ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

కాగా, నిన్న విశాఖపట్నం తీరంలో సిబిఐ భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది.25 వేల కేజీల డ్రగ్స్‌ను సీ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ను గుర్తించింది. ఇంటర్‌పోల్ ఇచ్చిన పక్కా సమాచారంతో….సీబీఐ చేపట్టిన ఆపరేషన్ గరుడులో భాగంగా సీపోర్టు అధికారులు 25 వేల కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news