ఈ నందమూరి హీరో ఇన్ని రోజులూ సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం..?

-

స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఎనిమిది మంది కొడుకులు జన్మించగా.. అందులో చాలామంది వివిధ రంగాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా వారిలో ఇద్దరు నిర్మాణ రంగం వైపు వెళ్లి విజయం సాధించలేక వెనుతిరిగి బిజినెస్ చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ వైపు నందమూరి హరికృష్ణ వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక వీరి వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్మ్ అడపాదడపా సినిమాలు చేసుకుంటూ.. నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక నందమూరి తారకరత్న అసలు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించడం లేదు. ఇక నందమూరి వారసుల లో స్టార్ హీరో గా చలామణి అవుతున్న ఒకే ఒక్క వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఒక్కడే పాన్ ఇండియా హీరో గా చలామణి అవుతూ నందమూరి ఫ్యామిలీ పేరు నిలబెడుతున్నాడు.Taraka ratna is Balayya's villain!ఇక తారకరత్న ఎందుకు ఇన్ని రోజులూ సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇకపోతే తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నందమూరి తారక రత్న రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఇంకా ఇన్నిరోజులు ఎక్కడున్నారు..? ఏం చేశారు..? ఎందుకు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణ వారసుడిగా నందమూరి తారక రత్న 1983 జనవరి 8వ తేదీన జన్మించారు.Rare Pic: Nandamuri Hero's Lovely Family

రాముడి పాత్ర పోషించాలి అంటే నందమూరి కుటుంబానికే చెందినట్టుగా ఎన్టీఆర్ తర్వాత ఆ వంశానికి చెందిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తారకరత్న కూడా ఎక్కువగా రాముడు పాత్రలు పోషించే వాళ్ళు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తారకరత్న కొంతవరకు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే నందమూరి వారసుడిగా ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేక పోయాడు. ఇక ఆ తరువాత యువరత్న, తారక్ ,భద్రాద్రి రాముడు, వెంకటాద్రి వంటి సినిమాలలో హీరోగా నటించినప్పటికీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాడు కానీ అమరావతి సినిమా లో విలన్ గా నటించిన ఈయన నంది అవార్డును సైతం సొంతం చేసుకోవడం గమనార్హం.Tarakratnas Equation With Nandamuri Heroes

ఇకపోతే ఈయన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో సహనం కోల్పోయిన తారకరత్న ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news