విష్వ‌క్ వివాదంలో ఏది త‌ప్పు? ఎవ‌రిది ఒప్పు !

-

విష్వ‌క్ వివాదానికి తెలంగాణ రాష్ట్ర స‌మితి కి సంబంధ‌మే లేదు. యాంక‌ర్ వెర్స‌స్ యాక్ట‌ర్ .. కానీ ఆ ఛానెల్ మాత్రం రాజ‌కీయంగా కూడా మ‌ద్ద‌తు ద‌క్కించుకునేందుకు, ఇందుకు మ‌హిళా సంఘాలను కూడా సాయం అడిగేందుకు వెనుకాడ‌డం లేదు. ఇవ‌న్నీ ఎందుకు గ‌తంలో ఆ ఛానెల్లో ప్ర‌సారితం అయిన క‌థ‌నాలే చాలు. అవును విష్వ‌క్ స‌హ‌నం కోల్పోయాడు త‌ప్పు.. ఆ విధంగా చేసిందే ఆ యాంక‌ర్ ప్ర‌వ‌ర్త‌న. అతికి పోయి వివాదాలు తెచ్చుకుని టీఆర్పీలు పెంచుకోవ‌డం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థ‌ల‌కు ముఖ్యంగా ఓ అతి వాగుడు ఛానెల్ కు తెలిసిన క‌ళ అని జ‌న‌సేన మండిప‌డుతోంది.

ఓ సినిమాను ఎవ్వ‌ర‌యినా ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చు. ఎవ్వ‌రు ఏ విధంగా అయినా త‌మకు తోచిన విధంగా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. పైన‌ల్ గా రిజ‌ల్ట్ బాగుంటేనే జ‌నం వ‌స్తారు. లేదంటే రారు. సినిమా రిజ‌ల్ట్ ను ప్ర‌చారం మార్చ‌దు. కానీ కొంత ప్ర‌భావం చూపిస్తుంది. ప్ర‌ముఖ ఛానెల్ లో వివాద‌స్ప‌దం అయిన మాట తీరు ఒక‌టి ఇప్పుడు హ‌ల్చ‌ల్ చేస్తోంది. బాధ్య‌త గ‌ల యాంక‌ర్ ఆ విధంగా మాట్లాడ‌మే త‌ప్పు ! అటుపై విష్వక్ కూడా ! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ విష్వ‌క్ న‌టించిన అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం అనే సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది. క‌నుక మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుందాం. గ‌తంలో ఆయ‌న న‌టించిన సినిమాల క‌న్నా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు ద‌క్కించుకోవాల‌ని కూడా కోరుకుందాం.

ఇక విష్వ‌క్ కు మ‌ద్ద‌తుగా హ‌రీశ్ శంక‌ర్ నిలిచారు. విష్వ‌క్ సినిమాకు మ‌ద్ద‌తుగా అయితే జొన్న‌ల‌గ‌డ్డ సిద్ధు, సాయి ధ‌ర‌మ్ తేజ్ నిలిచారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది.. ఇంత‌కూ ఈ వివాదంలో విష్వక్ వైపే జ‌నం ఎందుకు ఉన్నారంటే గ‌తంలో ఆ ఛానెల్ ప్ర‌వ‌ర్తించిన తీరే ఇందుకు కార‌ణం. ఎన్నో క‌థ‌నాలు వాస్త‌వాలు లేకుండా ప్ర‌సారితం చేసిన తీరు ఇందుకు కార‌ణం. ప్రాంక్ వీడియో చేయ‌డ‌మే నేరం అన్న విధంగా మాట్లాడ‌డం ఇంకో కార‌ణం. ఇంకా చెప్పాలంటే మీడియా నెపంతో గ‌తంలో చెప్పిన అబ‌ద్ధ‌పు వార్త‌లు ఇంకా ఆ ఛానెల్ పై జ‌నం లో కోపం పెరిగేందుకు కార‌ణం. ఇన్ని ఉంటుండ‌గా ఓ చిన్న సినిమా ప్ర‌మోష‌న్ ను భూత‌ద్దంలో ఎందుకు చూడ‌డం.

నో డౌట్ యాంక‌ర్ నోరు జారారు. ఆమె ఇప్పుడు జెండ‌ర్ సెన్సిటివిటీని బ‌య‌ట‌కు తెచ్చి సింపతీ కొట్టేయాల‌ని చూస్తున్నారు. ఇదెంత మాత్రం భావ్యం కాదు. జెండ‌ర్ సెన్సిటివిటీ అన్న‌ది ఒక్క ఆడ‌వాళ్ల‌కే కాదు మ‌గ‌వాళ్ల కూ ఉంటుంది. ఓ స్టూడియోలో ఓ యాంక‌ర్ స‌హ‌నం కోల్పోయి మాట్లాడ‌డం, ఆయ‌న్ను ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేయ‌డంతో ఇప్పుడా యాంక‌ర్ విప‌రీతంగా ట్రోల్ అవుతున్నారు. ఇందులో త‌ప్పు ఆ ఛానెల్ ది.. అతిథి క‌దా గౌర‌వించ‌డం కూడా తెలియ‌క‌పోతే ఎలా అని విష్వ‌క్ జ‌రిగిన అవ‌మానం పై నెటిజ‌న్లు ముఖ్యంగా జ‌న‌సేన అభిమానులు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news