జగన్ ఏం చేస్తారనేది మనకు ముఖ్యం కాదు.. మనమేం చేయాలనేది ముఖ్యం : సీఎం చంద్రబాబు

-

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ఢిల్లీ ధర్నా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో మనకు అనవసరమని.. ఆయన ఏం చేస్తారనేది మనకు ముఖ్యం కాదని.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనమేం చేయాలనేది ముఖ్యమని అని సీఎం చంద్రబాబు ఎంపీలకు తేల్చి చెప్పారు. జగన్ ధర్నా ఇష్యూను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.కాగా, జగన్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవడం ఆంధ్ర ప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ భేటీలో ఎంపీలకు చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news