పవన్ వస్తేనే కిందకు దిగుతా.. అర్ధరాత్రి హైటెన్షన్ పోల్ ఎక్కిన యువకుడు

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తేనే కిందకు దిగుతానని ఓ యువకుడు అర్ధరాత్రి హై టెన్షన్ కరెంట్ పోల్ ఎక్కాడు. దాదాపు మూడు గంటలు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని కిందకు తీసుకొచ్చారు.ఈ ఘటన కూకట్ పల్లిలోని మాధవరం నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సాయి అనే వ్యక్తి గత అర్ధరాత్రి హైటెన్షన్ పోల్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానికులు పోలీసులకు కాల్ చేయగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని యువకుడిని కిందకు దిగాలని కోరారు.

అప్పుడు ఆ యువకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పు డు ఇక్కడకు రావాలని, అప్పుడే తాను కిందకు దిగుతానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని పోలీసుల సాయంతో హైటెన్షన్ పోల్‌కి నిచ్చెనలు వేసి సుమారు 3 గంటల పాటు శ్రమించి ఆ యువకుడిని కిందకు దింపారు.అనంతరం అతన్ని అరెస్టు పీఎస్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news