వార్డ్ బాయ్ గా ఆస్పత్రికి వచ్చింది ఎవరు…?

-

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణాలో కూడా గ్యాంగ్ వార్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో సందీప్ అనే వ్యక్తి మరణించడం కూడా దీనికి మరింత ఆజ్యం పోసింది అని చెప్పవచ్చు. ఇక ఈ గ్యాంగ్ వార్ లో ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పండు అనే వ్యక్తి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సమయంలో అక్కడ ఒక ఘటన జరిగింది. శనివారం పండు చికిత్స పొందుతున్న వార్డులోకి శనివారం ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఎవరు అనేది చెప్పకుండా లోపలికి వార్డ్ బాయ్ గా వెళ్ళాలి అని చూసాడు. అక్కడ ఉన్న నర్సు మీరు ఎవరు ఎం కావాలి అని అడగగా సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్ళాలి అని ప్రయత్నం చేసాడు. ఇక వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

వార్డ్ బాయ్ గా ఎవరికి చెప్పకుండా లోపలికి వచ్చాడు. అతను ఎవరు అనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టారు. వార్డ్ బాయ్ తాలుకు వ్యక్తని విచారణలో తెలిసినట్టు సమాచారం. మరి అతను పండు దగ్గరకు ఎందుకు వచ్చి ఉంటాడు అనేది అర్ధం కావడం లేదు. నర్సు ప్రశ్నించిన సమయంలో సమాధానం ఎందుకు చెప్పలేదు అనే దాని మీద ఆరా తీస్తున్నారు. ఈ ఘటన మీద విజయవాడ పోలీస్ కమీషనర్ కూడా ఆరా తీసారు.

Read more RELATED
Recommended to you

Latest news