ఆవు నోట్లో బాంబు పెట్టిన మూర్ఖులు

-

మనుషులకు మానవత్వం ఉంటుంది అంటారు గాని కొన్ని కొన్ని ఘటనలు చూస్తే ఉండేది మనుషులకు కాదు జంతువులకు అని కొన్ని కొన్ని విషయాలు అర్ధమవుతు ఉంటాయి. మనుషుల్లో మానవత్వం ఏ మాత్రం కూడా కనపడే అవాకాశం ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇటీవల కేరళలో కొందరు మూర్ఖులు ఒక ఏనుగు నోట్లో బాంబు పెట్టి దాని మరణానికి కారణం అయిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ఒక ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక ఆవు నోట్లో బాంబు పెట్టారు. హిమాచల్‌ప్రదేశ్ లోని బిలాస్‌పూర్‌లో ఝూందూత ప్రాంతంలో ఒక ఆవు నోట్లో బాంబు పెట్టడంతో ఆవు యజమాని అయిన గురుదయాల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఇంటి పొరుగునున్న నందాలాల్ ఈ దారుణానికి పాల్పడినట్టు అతను పోలీసులకు వివరించాడు.

ఇక బాంబు పేలడంతో ఆవు నోరు మొత్తం కూడా పగిలిపోయింది. దీనితో దవడలు పగిలి వేలాడుతున్నాయి. ఆవు ఏమీ తినలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది అని నిందితుడికి కచ్చితంగా శిక్ష వెయ్యాలి అంటూ అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆవుని ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. ఆవు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news