వైసీపీకి ఓటు ఎందుకు వేయకూడదు.. చంద్రబాబు పై బొత్స సంచలన వ్యాఖ్యలు

-

వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్క మాట చెప్పాలని ఏపీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అనేక పథకాలు, హాస్పిటల్స్, పాఠశాలల్లో మార్పలు చూస్తే తమ పాలన ఏంటో తెలుస్తుందని అన్నారు. విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అన్నామని, బెల్ట్ షాప్స్ లేవని, పేద వాడికి మద్యం అందకుండా షాక్ కొట్టేలా రేట్ పెంచామని బొత్స అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగం అని జగన్ అన్నారుగా అని మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యానారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లని నాణెం చంద్రబాబు గతంలో 175 మంది పోటీ చేస్తే ఏం అయిందో చూశామని దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట నెలబెట్టుకోలేదు కాబట్టే చంద్రబాబు ఓడిపోయారని, తమ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇంకో మూడునెలలు తర్వాత టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండదన్నారు. చంద్రబాబు సీటుకే దిక్కు లేదని, ఇక టీడీపీ 175 ఎక్కడ గెలుస్తుందని విమర్శించారు. ఓడిపోతాడు కాబట్టి చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news