ఎందుకు వీళ్ళు ఇంత “నిశబ్ధం” గా ఉన్నారు.. కరోనా కి భయపడుతున్నారా ..?

-

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన సినిమా ‘నిశబ్దం’. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత అనుష్క భాగమతి సినిమాలో నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికి వసూళ్ళ పరంగా మాత్రం నిరాశ పరచింది. అరుంధతి తర్వాత మళ్ళి అనుష్క సోలోగా భాగమతి సినిమాతో వస్తుందనగానే ప్రేక్షకులు భారీ స్థాయిలో ఊహించుకున్నారు. భాగమతి అనగానే అందరికి ఊహలు ఆకాశంలో ఉన్నాయి. కాని ఆ ఊహలని, అంచనాలని భాగమతి అందుకోలేకపోయింది. దాంతో అనుష్క మరో సినిమా ఒప్పుకోవడానికి చాలా సమయం తీసుకుంది.

 

అయితే అనూహ్యంగా నిశబ్ధం సినిమా అవకాశం రావడంతో వెంటనే కమిటయింది. మల్టీ లాంగ్వేజ్ సినిమా కావడంతో ఈ సినిమా మీద అనుష్క తో పాటు ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అందులో కోన వెంకట్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకం పెట్టుకుంది అనుష్క. ఇక ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి పాత్రలో నటిస్తుంది. అంతేకాదు మాధవన్, శాలిని పాండే, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో ఈ సినిమా హిట్ గ్యారెంటీ అన్న టాక్ ని సంపాదించుకుంది. వాస్తవంగా అయితే ‘నిశబ్దం’ ఏప్రిల్‌ ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాని కరోనా కారణంగా మే 3 వరకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న సినిమాలు పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో మళ్ళీ తమ సినిమాల రిలీజ్ డేట్ ని లాక్ చేసుకునే ప్లాన్స్ లో ఉన్నారు. ఇప్పటికే నాని, పవన్ కళ్యాణ్, రవితేజ, సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో ఒక షెడ్యూల్ అనుకుంటున్నారు. కాని నిశబ్ధం టీం మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అయితే అందుకు కారణం కరోనా కారణంగా జనాలు అంత త్వరగా థియోటర్స్ కి వస్తారా అన్న సందేహం ఉండటం వల్లే రిలీజ్ డేట్ ని ప్రకటించడం లేదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news