సైదాబాద్ లో దారుణం…మద్యం మత్తులో కన్న బిడ్డను పొట్టనపెట్టుకున్న భార్య భర్తలు.!

-

మద్యం మత్తులో పసికందు ప్రాణాలు తీశారు తల్లితండ్రులు. ఈ ఘటన హైదరాబాద్ సైదాబాద్ పూసల బస్తీ లో చోటు చేసుకుంది. పొదిల రాజు, జాహ్నవి దంపతులు బస్తీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జాహ్నవి కి 22రోజుల శిశువు ఉన్నాడు. అయితే గత రాత్రి భార్యా భర్తలు కలిసి మద్యం సేవించారు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రాజు తన భార్య జాహ్నవి ప్లాస్టిక్ పైపు తో కొట్టగా ఆమె తన ఒడిలో ఉన్న శిశువును అడ్డుపెట్టింది.

అంతే కాకుండా భర్త కొడుతున్న సమయం లో బిడ్డను గట్టిగా పట్టుకునే సరికి ఊపిరి ఆడక శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దాంతో స్థానికులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా శిశువు చికిత్స పొందుతూ మరణించింది. ఇదిలా ఉంటే రెండేళ్ల వీరికి ఓ బాబు పుట్టగా ఐదు నెలల వయసులో అతడిని మద్యం మత్తులో భయటకు విసిరారు. ఆ బాబు సంరక్షణ కోసం యూసుఫ్ గూడ శిశు విహార్ లో ఉంచారు. ఇక ఇప్పుడు రెండో బిడ్డను కూడా పొట్టన పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news