ప్రియుడికి భార్య ఫోన్… పిల్లలను చంపి.. తండ్రి ఆత్మహత్య

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. తన భార్య కారణంగా… పిల్లలను చంపి తండ్రి కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని సాయిబాబా కాలనీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Wife calls boyfriend kills children father commits suicide
Wife calls boyfriend kills children father commits suicide

గుంటూరు పరిధి నరసరావుపేటలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు యూసుబ్ అనే ముస్లిం వ్యక్తి. ఇతనికి సైదాబీ అనే భార్య ఉంది. అయితే తన భార్య ప్రియుడితో ఫోన్లో తరచూ మాట్లాడుతూ ఉందని… భర్త గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే మొన్న మూడు రోజుల కిందట అంటే 14వ తేదీన భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సైదాబీ తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఈ నేపథ్యంలోనే పిల్లలు హుస్సేన్ అలాగే ఆరిఫ్ లను తీసుకొని యూసుబ్ తన అక్క ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలకల మందు ఇచ్చి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకొని యూసుబ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news