మహబూబాబాద్ లో దారుణం..భర్త మర్మాంగం కోసి హత్య..!

-

భార్య భర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలు దారుణాలకు పాల్పడే వరకు వెళుతున్నాయి. భర్తలు వేధిస్తున్నారని భార్యలు…భార్యలు వేధిస్తున్నారని భర్తలు దారుణమైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని విషాదం లో నింపుకుంటున్నారు. తాజాగా మహబూబా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్త మర్మాంగం కోసి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… మహబూబా బాద్ మరిపెడ మండలం తానం చెర్ల రెవెన్యూ పరిధిలోని వాంకుడోతు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

crime
crime

తన భర్త భూక్యా బిచ్యా తరచూ మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్నాడు అని భార్య ప్రమీల ఏకంగా కోపం తో మర్మాంగం కోసి వేసింది. దాంతో భర్త మృతి చెందాడు. ఈ ఘటన పై సమాచారం అందడం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news