ఏపీలో దారుణం..భ‌ర్త మ‌ర్మాంగం పై కొట్టి చంపిన భార్య‌.. !

-

త‌న భ‌ర్త రోజూ మ‌ద్యం సేవించి వ‌స్తూ వేధింపులకు గురిచేస్తున్నాడ‌ని ఓ భార్య త‌ట్టుకోలేక‌పోయింది. ఎన్ని సార్లు చెప్పినా భ‌ర్తలో మార్పు రాక‌పోవ‌డంతో విసిగిపోయిన భార్య మ‌ద్యం మ‌త్తులో ఉన్న భ‌ర్త‌ను హ‌త మార్చింది. అనంత‌రం ఇంటి పై నుండి ప‌డి చ‌నిపోయాడ‌ని పోలీసుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ విచార‌ణ అనంతరం భార్యనే భ‌ర్త‌ను హ‌త‌మార్చిన‌ట్టు తేలింది. ఈ ఘ‌ట‌న ఏపీలోని చిత్తూరు జిల్లా లోని ప‌ల‌మ‌నేరు గ్రామంలో చోటు చేసుకుంది. ప‌ల‌మ‌నేరు గ్రామానికి చెందిన కేశ‌వ మే 29న‌ మృతి చెందాడు.

crime
crime

త‌న భ‌ర్త ఇంటి పై నుండి ప‌డి చ‌నిపోయాడ‌ని భార్య చుట్టుప‌క్క‌ల వారికి పోలీసుల‌కు చెప్పి న‌మ్మించింది. అయితే త‌న కొడుకు మృతి పై త‌న‌కు అనుమానం ఉందని మృతుడి త‌ల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేశ‌వ భార్య‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు నిజం భ‌య‌ట‌పెట్టేసింది. త‌న భర్త ప్ర‌తి రోజూ మ‌ద్యం సేవించి వ‌చ్చి వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని అందుకే మ‌ర్మాంగం పై కొట్టి చంపాన‌ని నిజం ఒప్పుకుంది. దాంతో నింధితురాలిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news