ఆ ఏడాదిని ఎప్పటికీ మరిచిపోలేను: హార్దిక్ పాండ్య

-

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది.రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ క్రీడా ఛానల్‌ ఫ్యాన్‌ ఈవెంట్‌లో హార్దిక్‌ మాట్లాడాడు.2015 ఐపీఎల్లో ముంబై జట్టుకు ఆడటంతోనే తన ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఆశలతో గుజరాత్ నుంచి వచ్చిన అబ్బాయి కలలు ఆ సమయంలో నెరవేరాయని చెప్పారు. ముంబై ఇండియన్స్ లేకుంటే తాను క్రికెట్ లో ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదని చెప్పారు.

మొత్తం సీజన్‌లో ముంబయి జట్టుకు నా వంతు సాకారం అందించా అని తెలిపారు. ఆ సీజన్లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు రావడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news