కైలాసగిరిపై దారుణం: యువతిపై యువకుల సామూహిక అత్యాచారం.. ఆ త‌ర్వాత‌..

-

నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై బుధవారం సాయంత్రం ఒక యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ యువతి (22), యువకుడు (18) కైలాసగిరికి చేరుకున్నారు. కొండపై కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత ఇద్దరూ ఓ ప్రదేశంలో కూర్చున్నారు. అనంతరం బాలుడు ఓ కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. యువతి మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అప్పటికే అక్కడికి చేరుకున్న అతని స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో పడి వున్న బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు అని, మరో నిందితుడి పేరు గురివిల్లి రమణ అని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం జోడుగుళ్లపాలేనికి చెందిన వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news