దారుణం: మహిళపై 12మంది గ్యాంగ్‌ రేప్‌

-

మ‌హిళ‌లపై అమానుషంగా దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. మొన్న‌టికి మొన్న త‌న‌పై 139మంది లైంగిక‌దాడి చేశారంటూ ఓ యువ‌తి పంజాగుట్ట పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా.. ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక లైంగిక‌దాడికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. క్షతగాత్రురాలిని ఆమె సోదరి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది. పని నిమిత్తం సోమవారం రాత్రి ఆమె రైల్వే స్టేషన్‌ సమీపంలోకి వెళ్లింది.

అయితే.. ఒంటరిగా ఉన్న సదరు మహిళను చూసిన విక్కీ అనే యువకుడు ఆమెతో మాట్లాడాడు. డబ్బులు అవసరం ఉందని ఆమె చెప్పడంతో తాను ఇస్తానని నమ్మబలికి.. కలెక్టరేట్‌ దగ్గర ఉన్న ధర్నా చౌక్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రెవెన్యూ భవన్‌కు సంబంధించిన ఖాళీ గదిలో ఆమెపై లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. ఇంత‌లో విక్కీ స్నేహితులు 11 మంది అక్కడకు చేరుకుని ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే.. అదే సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడాన్ని గమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అర్ధరాత్రి వేళ అచేతనంగా కనిపించిన బాధితురాలిని పెట్రోలింగ్‌ సిబ్బంది ప్రశ్నించగా.. జరిగిన దారుణం ఘ‌ట‌న‌ గురించి తెలిపింది. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులు నగరంలోని హమాల్‌వాడీకి చెందిన యువకులని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news