జ్యోతిష్యుడు వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు

-

జ్యోతిష్యుడు వేణు స్వామికి  తెలంగాణ మహిళా కమిషన్ తాజాగా  నోటీసులు పంపించింది. ఈనెల 22న మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు పై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. విచారణకు వేణుస్వామి ఆగస్టు 22న హాజరుకావాలని సమన్లు జారీ చేసారు.

ఇటీవలే వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాగచైతన్య- శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత మరోసారి కాంట్రవర్సీకి తెరలేపి విమర్శల పాలయ్యాడు. దీంతో జ్యోతిష్యుడు ఇకపై సెలబ్రిటీల లైఫ్ కు సంబంధించి జ్యోతిష్యం చెప్పనని ప్రకటించాడు. చైతూ, శోభిత నాలుగేళ్ల తర్వాత విడిపోతారని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వేణుస్వామి పై దుమ్మెత్తిపోశారు. విపరీతంగా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.   స్పందించిన వేణుస్వామి  సినిమా, రాజకీయ రంగాల వారి జాతకాలు ఇకపై చెప్పనంటూ యూటర్న్ తీసుకున్నాడు. గతంలో నేను చెప్పిన మాటకు కట్టుబడే ఉన్నా. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను. అందుకే వేణుస్వామి దానికి కొనసాగింపుగా నాగచైతన్య-శోభిత భవిష్యత్తు చెప్పాల్సి వచ్చిందని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version