మరో రెండ్రోజుల్లో ఉమెన్ ప్రీమియర్ లీగ్

-

మహిళల ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో కొత్త సీజన్తో క్రికెట్ లవర్స్ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్ ప్రారంభం కానున్న వేళ ఆయా ప్లేయర్లు తమ జట్లతో చేరుతున్నారు. ఈ సీజన్లో మొదటి దశ మ్యాచ్లు బెంగళూరులో, ఆ తర్వాతి మ్యాచ్లు ఢిల్లీలో జరగనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను నిర్వహిస్తుండగా ఈ వేడుకకు బాలీవుడ్ హీరోలు ముఖ్య అతిథులుగా పాల్గొనేనున్నారు.బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ఈసారి డబ్ల్యూపీఎల్ ప్రారంభోత్సవ వేదికపై అలరించనున్నారు.

జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రారంభ వేడుక సహా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కియారా అద్వానీ, కృతి సనన్.. డబ్ల్యూపీఎల్‌ గతేడాది ప్రారంభ వేడుకలో మెరిసిన విషయం తెలిసిందే.డబ్ల్యూపీఎల్‌ 2024 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరుగుతుండగా మొత్తం ఐదు టీమ్స్ 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news