WORLD CUP 2023: కష్టాల్లో ఇంగ్లాండ్ టీం.. 300 పరుగులు అయినా చేస్తుందా ?

-

ఈ రోజు అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాతమ్ ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించి చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కు ఓపెనర్లు మొదటి వికెట్ కు 44 పరుగులు భాగస్వమ్యన్ని అందించినా ఆ తర్వాత వెంట వెంటనే ఇద్దరూ అవుట్ అవడంతో ఇంగ్లాండ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. కానీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రూట్ తనదైన అనుభవంతో నెమ్మదిగా ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ ను అందించే దిశగా తీసుకువెళుతున్నారు. కానీ ఇతనికి సహకరించే ఆటగాళ్లే కరువయ్యారు..

వరుసగా బ్రూక్ (18), అలీ (11), బట్లర్ (43) లు అవుట్ అవడంతో ఇంగ్లాండ్ 188 పరుగుల వద్ద ఉండగా అయిదు వికెట్లు కోల్పోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ కనీసం పరుగులు అయినా చేస్తుందా అని సందేహంలో జట్టు యాజమాన్యం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news