WORLD CUP 2023: న్యూజిలాండ్ పై ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న టీం ఇండియా !

-

రేపు మధ్యాహ్నం ముంబై లోని వాంఖడే స్టేడియం లో ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన వరల్డ్ కప్ లో మొదటి సెమి ఫైనల్ జరగనుంది. ప్రపంచం మొత్తం దృష్టి అంతా ఈ మ్యాచ్ పైనే కేంద్రీకృతం అయింది. ఎందుకంటే గత వరల్డ్ కప్ ఆస్ట్రేలియా లో జరిగిన సమయంలో సెమీఫైనల్ లో ఇండియా న్యూజిలాండ్ లు తలపడగా, అనూహ్యంగా ఇండియా ఓటమిపాలయింది. ఇప్పుడు ఇండియా అభిమానులు అంతా ఖచ్చితంగా ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఎప్పుడూ లేనంతగా అన్ని విభాగాలలోనూ ఇండియా చాలా పటిష్టంగా ఉండడంతో కప్ మనదే అంటూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది టీం ఇండియా. ముఖ్యంగా ఇండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే… కివీస్ లో కాన్ వే, రవీంద్ర, విలియమ్సన్ మరియు ఫిలిప్స్ లను అడ్డుకుంటే విజయం మన సొంతం అయినట్లే.

అదే విధంగా కివీస్ బౌలింగ్ లో బౌల్ట్, సౌథీ మరియు శాన్తంర్ లను సమర్థవంతంగా ఎదుర్కొంటే మన పని సులభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news