వరల్డ్ కప్ 2023: “ఇండియా – పాకిస్తాన్” మ్యాచ్ కు డేట్ ఫిక్స్ !

-

2023 లో ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సారి ఇండియా ఈ టోర్నమెంట్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. గతంలో 2011 లో ఇండియా ఆతిధ్యం ఇవ్వగా ధోని కెప్టెన్సీ లో కప్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఆతిధ్యం ఇవ్వనుండగా మరోసారి ఇండియా టైటిల్ ఫేవరెట్ గా నిలవనుంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరగనున్న మ్యాచ్ కు డేట్ ఫిక్స్ అయిందట. ఈ విషయాన్ని క్రిక్ బజ్ ఒక ప్రకటనలో తెలిపింది, కాగా షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ లు 13 అక్టోబర్ నుండి మొదలై 26 నవంబర్ న జరిగే ఫైనల్ తో పూర్తి కానున్నాయి.

 

ఇండియా మరియు పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉండనుండగా.. అక్టోబర్ 15వ తేదీన మ్యాచ్ జరగనుంది. ముందుగా పాకిస్తాన్ ఇండియాలో మ్యాచ్ ఆడబోమని తెలిపినా… ఆ తర్వాత ఐసీసీ జోక్యంతో ఇప్పుడు ఇండియాలో ఆడేందుకు సమ్మతించింది. మరి ఈ దాయాదుల పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news