వరల్డ్ కప్ 2023: పాకిస్తాన్ పై నెదర్లాండ్ ప్లేయర్ విక్రంజీత్ సింగ్ హాఫ్ సెంచరీ !

-

హైదరాబాద్ పాకిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టు అదరగొడుతోంది. ముందుగా అద్భుతమైన బౌలింగ్ తో పాకిస్తాన్ లాంటి జట్టును బెంబేలెత్తించగా, ఇప్పుడు 287 పరుగుల ఛేదనలో పాకిస్తాన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు దూసుకువెళుతోంది. కాగా ఓపెనర్ గా వచ్చిన భారత సంతతి ఆటగాడు విక్రమ్ జీత్ సింగ్ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని అర్ద సెంచరీ పూర్తి చేశారు. విక్రమ్ జీత్ సింగ్ 67 బంతులను ఎదుర్కొని నాలుగు ఫోర్లు మరియు సిక్స్ సహాయంతో 52 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ అదే ఓవర్ లో షాదాబ్ ఖాన్ వేసిన బంతిని సిక్సు గా మలచబోయి జమాన్ చేతికి చిక్కాడు. తద్వారా నెదర్లాండ్ మూడవ వికెట్ ను కోల్పోయింది.. ప్రస్తుతం క్రేజులో బస్ డే లీడ్ మరియు తేజ లు ఉన్నారు. నెదర్లాండ్ లక్ష్యానికి ఇంకా 160 పరుగుల దూరంలో ఉంది.

పాకిస్తాన్ ఇప్పుడు పూర్తి ఒత్తిడిలో ఉంది. షహీన్ షా ఆఫ్రిది, హరీష్ రఫ్ లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news