వసూళ్ల వర్షం తో పాటు క్రేజీ ఆఫర్స్ వస్తున్న రైటర్ పద్మభూషణ్ ..!!

-

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ నటించిన తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే  5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  ఇంకా వసూళ్ళు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీని కోసం యూనిట్ వర్గాలు సినిమా ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక రేపు తెలుగు రాష్ట్రా లలో ఎంపిక చేసిన థియేటర్స్ లో మహిళలకు ప్రత్యేకంగా సినిమా చూపించాలని ఫిక్స్ అయ్యారు. దీనికోసం మహిళల నుండి ఒక్క రూపాయి కూడా ఆశించ కుండా ప్రీగా సినిమా చూపించాలి అని ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం తెలుగు ప్రజలకు మాటల పెద్దమ్మ గా సుపరిచితం అయిన సుమక్క ను లైన్ లోకి దింపారు.

ఆమె తన సోషల్ మీడియాలో ఈ సమాచారం ఇస్తూ సందడి చేస్తోంది.మరోవైపు, ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను థియేటర్‌లలో విడుదల చేయడానికి ముందే జీ నెట్‌వర్క్‌కు ఇచ్చారు. అలాగే రైటర్ పద్మభూషణ్ యొక్క రీమేక్ హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్న ఇతర భాషల నిర్మాతల నుండి మేకర్స్ కూడా ఫ్యాన్సీ ఆఫర్ర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అందుకే అంటారు కాంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదని..

 

Read more RELATED
Recommended to you

Latest news