కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా… రెండేళ్ల పాలన వేడుకలో భావేద్వేగం

-

బెంగళూరు: కర్ణాటక సీఎంగా యడియూరప్ప రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆయన రెండేళ్ల పాలనపై వేడకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యడియూరప్ప పాల్గొన్నారు. పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఒక్కసారిగా యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్లు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని చెప్పారు. రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను ప్రజల కోసం పని చేశానని వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశానని పేర్కొన్నారు. పోరాటంలో ఒంటరినై పోయానని బాధపడలేదన్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేస్తానని యడియూరప్ప తెలిపారు.

కాగా ప్రస్తుతం యడియూరప్ప వయస్సు 76 సంవత్సరాలు. బీజేపీ లెక్కల ప్రకారం 75 ఏళ్లు దాటిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే కేంద్ర అధిష్టానంతో ఆయన చర్చలు జరిపారు. అధిష్టానం కూడా రాజీనామా చేయమని చెప్పడంతో యడియూరప్ప తన సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు కర్ణాటక సీఎంగా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news