కోర్ట్ లు జగన్ వెంట్రుక పీకలేవన్న వైసీపీ నేతపై హైకోర్ట్ లో ఫిర్యాదు…!

-

వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు న్యాయమూర్తులను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు కామెంట్లను సుమోటోగా తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని ఆయన కోరారు. ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్సీ రవీంద్రబాబు హైకోర్ట్ న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను కూడా అందించారు.

న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అభ్యంతరకరమని, దురుద్ధేశపూరితమని ఫిర్యాదు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యలపై వెంటనే సుమోటో కేస్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు. హైకోర్ట్ ఇటీవల రాజధాని విషయంలో స్టేటస్ కో ఇచ్చిన నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కోర్ట్ లు జగన్ వెంట్రుక కూడా పీకలేవు అని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version