వైసీపీ నేతలు అనవసరంగా టీడీపీ చేతికి దొరుకుతున్నారా…?

-

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడిపోయే పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాదు వాళ్ళు చెప్పుకునే గొప్పలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి అందరూ కష్టపడుతుంటే వీళ్ళు మాత్రం ఇప్పుడు ఆర్భాటాలకు పోతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చికిత్స విషయంలో ప్రభుత్వం కాస్త దూకుడుగా వెళ్తుంది. కేసులు పెరగడం తో ఇప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఐసోలేషన్ వార్డులను, ల్యాబుల సంఖ్యను పెంచుతుంది. తాజాగా ఈ ల్యాబుని, ఐసోలేషన్ వార్డ్ ని ఓపెన్ చేసారు వైసీపీ నేతలు. మంత్రి ఆవంతి శ్రీనివాస్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఓపెన్ చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇదేం వింత రా బాబు అంటున్నారు. అసలు రిబ్బన్ కట్ చేయడం ఏంటీ అని విమర్శలు చేస్తున్నారు. దానికి రిబ్బన్ కూడా ఆ పార్టీ ప్రధాన రంగు గ్రీన్ ని పెట్టారు.పైగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిపై ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. మైండ్ ఉందా పోయిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేష్టల ద్వారా జగన్ పరువు తీస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news