కుప్పం మున్సిపాలిటీ గెలిచే దమ్ము కూడా చంద్రబాబుకి లేదు…ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

-

పెట్రోల్ డీజిల్ రేట్ల అంశం లో చంద్రబాబు ధర్నా ఏపీ లో కాదు…జంతర్ మంతర్ దగ్గర చేయాలని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. దమ్ముంటే బీజేపీ పై ధర్నా చేయాలని చెప్పారు. కుప్పం మున్సిపాలిటీని కూడా గెలిచే దమ్ము చంద్రబాబు కి లేదంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి కేంద్రం 3 లక్షల 45 వేల కోట్లు ప్రజా ధనాన్ని తీసుకున్నారంటూ నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీలకతీతంగా పథకాలు ఇస్తున్నాం కాబట్టి అందరూ మాతో కలిసి వస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కుప్పం లో గెలవలేక దొంగ ఏడుపులు చంద్రబాబు ఏడుస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. కుప్పం లో ఇల్లు లేదు…కార్యకర్తల ఇంట్లో ఉండలేక బస్సుల్లో రాజకీయలు చేస్తున్నందుకు సిగ్గు పడు చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఏపీలో టిడిపి ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news