మూడు రాజదానులపై వెనక్కు తగ్గేది లేదు: గుంటూరు జిల్లా ఎమ్మెల్యే

-

రాజధాని ప్రాంతంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు అని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా సిఎం నిర్ణయం తీసుకున్నారు అని దానికి కట్టుబడి ఉన్నాం అని ఆయన స్పష్టం చేసారు. నా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమమైనింగ్ పై విచారణ జరుగుతుందని ఆయన మీడియాకు తెలిపారు.

నిబద్దతతో పనిచేస్తున్నాం అన్నారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోంది అని ఆయన వివరించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకు వచ్చే నెలలో నష్టపరిహారం అందిస్తాం అని ఆయన అన్నారు. లైలా తుఫాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు అని వివరించారు. రైతులను ఉదారంగా ఆదుకునే ప్రభుత్వం ఇది అని ఎమ్మెల్యే వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news