తెలంగాణాలో కాంగ్రెస్ ఓటమి పక్కా: వైసీపీ ఎంపీ

-

ఈ రోజు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల గురించి తన అభిప్రాయాన్ని తెలియచేశారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఓటమి చెందుతుందన్నారు. కేవలం తెలంగాణాలో మాత్రమే కాదు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సైతం కాంగ్రెస్ కు ఓటమి తప్పదని ఈయన ఖరాఖండీగా చెప్పేశారు. గతాన్ని ఒకసారి చూసుకుంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ అణగారిన వర్గాలు మరియు పేదల కోసం పనిచేసిన దాఖలాలు లేవంటూ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఇక రాజస్థాన్ లో గత అయిదు సంవత్సరాలలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ప్రజలు రుచి చూశారు.. మళ్ళీ ఇలాంటి పాలనను కోరుకుంటారని నేను అనుకోవడం లేదంటూ విజయసాయి రెడ్డి చెప్పారు. ఇంకా గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన కుంభకోణాలు గురించి తెలిసిన ప్రజలు గెలిపించబోరు అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడారు.

మరి ఆంద్రప్రదేశ్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయా ? కనీసం తెలంగాణాలో కూడా కాంగ్రెస్ గెలవదా ?

Read more RELATED
Recommended to you

Latest news