బిగ్ బాస్ 7: విర్రవీగుతున్న పల్లవి ప్రశాంత్… మరీ ఎక్కువైందంటున్న నెటిజన్లు !

-

ఒక సామాన్యుడిగా రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ మొదటి రెండు వారాలలో బాగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. రెండవ వారంలో అమర్ చేసిన పనికి పల్లవి ప్రశాంత్ కు బాగా ప్లస్ అయింది. అప్పటి నుండి శివాజీ సహాయంతో చిన్న చిన్నగా టాస్కులు ఆడుకుంటూ హౌస్ మెట్ అయ్యాడు మరియు కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఇతనిలో వచ్చిన మార్పులు మాములుగా లేవని చెప్పాలి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే నిన్న నామినేషన్స్ లో సందీప్, తేజ లతో వ్యవహరించిన తీరు. ఎవ్వరికీ భయపడను , బరా బర్ చెబుతాను, నేనింతే, నాపేరు పల్లవి ప్రశాంత్.. అంటూ చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్లు బాగా కోపంగా ఉన్నారు.

మరీ సందీప్ తో అయితే చాలా దారుణంగా వధించాడు.. సందీప్ ప్లేస్ లో ఇంకెవ్వరు ఉన్నా చాలా గొడవ అయ్యేది అంతలా తనను రెచ్చగొట్టాడు ప్రశాంత్. ఇక మీదట హౌస్ లో ఈ విధంగా బెహేవ్ చేస్తే ప్రేక్షకులు ఇంటికి సాగనంపడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news