Andhra Pradesh: వైసీపీ ఆరో జాబితా విడుదల

-

అమరావతి: వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆరవ జాబితాను విడుదల చేసింది. ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలో గెలుపుకోసం కసరత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తన అభ్యర్థులను విడతల వారీగా 5 జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆరవ జాబితాను కూడా విడుదల చేసింది.4 ఎంపీలు, 6 అసెంబ్లీ ఇన్‌ఛార్జుల పేర్లు ప్రకటించారు. రాజమండ్రి(ఎంపీ)-గూడూరి శ్రీనివాస్, నర్సాపురం(ఎంపీ)-అడ్వకేట్ ఉమా బాల, గుంటూరు (ఎంపీ) – ఉమ్మారెడ్డి వెంకట రమణ, చిత్తూరు(ఎంపీ)- ఎన్‌.రెడ్డప్ప.. మైలవరం(ఎమ్మెల్యే) – తిరుపతి రావు యాదవ్, మార్కాపురం( ఎమ్మెల్యే)- అన్నా రాంబాబు, నెల్లూరు సిటీ( ఎమ్మెల్యే)- ఎండీ ఖలీల్, ఎమ్మిగనూరు ( ఎమ్మెల్యే)- బుట్టా రేణుక, గిద్దలూరు ( ఎమ్మెల్యే)- కుందూరు నాగార్జున రెడ్డి, జీడీ నెల్లూరు( ఎమ్మెల్యే) -కె.నారాయణస్వామి.

Read more RELATED
Recommended to you

Latest news