టాలీవుడ్‌ లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యంగ్‌ డైరెక్టర్‌ మృతి!

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సలీం గౌస్‌ మరణించిన ఘటన మరువక ముందే.. మరో సంఘటన చోటు చేసుకుంది. యంగ్‌ డైరెక్టర్‌ పైడి రమేష్‌ కరెంట్‌ షాక్‌ తో మృతి చెందారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. రమేష్‌ యూసఫ్‌ గూడలోని ఓ అపార్ట్‌ మెంట్‌ లో నివాసం ఉంటున్నారు.

గురువారం సాయంత్రం వాకింగ్‌ వెళ్లి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో.. వర్షం పడుతోంది. దీంతో బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయటానికి వెళ్లారు. గాలికి కొన్ని బట్టలు కరెంట్‌ తీగ పై పడటంతో.. రాడ్‌ తో తీయటానికి ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే షాక్‌ కొట్టి నాలుగో అంతస్తులో ఉన్న ఇంటి బాల్కనీలోంచి కిందకు పడిపోయాడు. దీంతో రమేష్‌ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అతను ఎలా చనిపోయాడనే దానిపై విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news