అట్టుంటది జగన్‌ తో…కేటీఆర్‌ వీడియోను షేర్‌ చేసిన లోకేష్‌

-

ఏపీలో కరెంట్‌, నీళ్లు సరిగా లేవని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అయితే… మంత్రి కేటీఆర్‌ అన్న వీడియోను షేర్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌..ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సెటైర్‌ వేశారు. కేటీఆర్ నోట…జగన్ విధ్వంస పాలన మాట అని.. అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. అంటూ లోకేష్‌ సెటైర్‌ వేశారు. ఈ మేరకు వీడియోను కూడా షేర్‌ చేశాడు.

ఇక అంతకు ముందు.. ఇవాళ క్రెడాయ్‌ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఏపీలో కరెంటు, నీళ్లు ఇతర వసతులు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లివచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు…నాలుగు రోజులు ఉన్నాను….అక్కడ కరెంట్ లేదు,నీళ్లు లేవు,రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణలోని వాళ్ళను నాలుగు రోజులు బస్సుల్లో ఏపీకి పంపండి…తెలంగాణ సర్కార్ ఏమి చేస్తుందో విలువ తెలుస్తుందని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. నేను చెప్పడం కాదు…మీరు కూడా ఒక సారి ఏపీ వెళ్లి చూసి రండన్నారన్నారు. అప్పుల తెలంగాణ అని కొందరు అంటారు కేసీఆర్ అప్పు చేసి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగం కోసం ఖర్చు చేసామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news