తరగని అందం మీది మరోసారి మాకోసం హీరోయిన్ గా చేయొచ్చుగా మాడం ఛార్మి ..!

-

ఛార్మి కౌర్.. దీపక్ అనే హీరో నీతోడు కావాలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎలా ఉన్నా చార్మి మాత్రం టాలీవుడ్ లో వరసగా శ్రీ ఆంజనేయం, చంటి, లక్ష్మీ, చక్రం, మాస్, అనుకోకుండా ఒకరోజు, మంత్ర, రాఖీ, పౌర్ణమి …ఇలా చాలా హిట్ సినిమాలలో నటించారు. దాదాపు 15 సంవత్సరాలు హీరోయిన్ గా సక్సస్ ఫుల్ జర్నీ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో చేసిన సినిమాలన్ని ఛార్మి కి హీరోయిన్ గా చాలా మంచి పేరు తీసుకువచ్చాయి. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బుడ్డా హోగా తెరా బాప్ లోను నటించి హిందీ సీమలో అడుగుపెట్టి ఆ తర్వాత మరోసారి గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఇచ్చారు.

 

అయితే హీరోయిన్ గా ఉన్నప్పుడే జ్యోతిలక్ష్మీ సినిమాలో నటిస్తూ ఒక నిర్మాతగా మారారు. పూరి జగన్నాధ్ నిర్మించిన ఈ సినిమాతోనే ఛార్మి నిర్మాతగా మారి అప్పటి నుంచి వరసగా సినిమాలకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాధ్ తో అసోసియోట్ అయినప్పటి నుంచి పూరి కనెక్ట్స్ ద్వారా జ్యోతిలక్ష్మీ, రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ నిర్మించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న పూరి, ఛార్మి ప్రస్తుతం ఆకాష్ పూరి తో రొమాంటిక్ సినిమాని నిర్మిస్తున్నారు.

 

ప్రొడక్షన్ వ్యవహారాలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారన్న పేరు ని చార్మి సంపాదించుకున్నారు. సెట్ లో ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే చార్మి సమకూరుస్తున్నారు. అయితే ఇప్పటికి చార్మి చెరగని అందంతో మెరిసిపోతున్నారు. సినిమా మేకింగ్ పిక్చర్స్ లో ఛార్మి ని చూసిన వాళ్ళు ప్రొడ్యూసర్ అంటే నమ్మడం లేదు. అంత అందం తో ఆకట్టుకుంటున్నారు. ఇన్స్టాగ్రాం లో లేటెస్ట్ ఫొటోలని పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. అందుకే చాలామంది తరగని అందం మీది మరోసారి మాకొసం హీరోయిన్ గా సినిమాలో నటించవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారట. నిజమే ఛార్మి మరోసారి హీరోయిన్ గా చేస్తే చూడటానికి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సిద్దంగా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news