క్రియేటర్లకు గుడ్ న్యూస్​ చెప్పిన యూ ట్యూబ్​…

-

భారత్​ లో స్మార్ట్​ ఫోన్​ ఉన్న ప్రతి ఒక్కరూ యూ ట్యూబ్ ( Youtube )​ తప్పకుండా చూసే ఉంటారు. అంతలా యూ ట్యూబ్ ప్రాచూర్యం పొందింది. ఇక భారత ప్రభుత్వం చైనాతో వివాదాల కారణంగా చైనా కంపెనీ అని టిక్​ టాక్​ ను నిషేధించిన తర్వాత యూ ట్యూబ్​ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లుగా యూ ట్యూబ్​ కూడా షార్ట్​ వీడియోలను ప్రవేశపెట్టింది. కాగా టిక్​ టాక్​ లేకపోవడంతో ఈ వీడియోలను జనాలు విపరీతంగా చూస్తున్నారు. దీంతో యూ ట్యూబ్​ మరింత మంది షార్ట్​ వీడియోలు చేసే వారిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు అడుగులేస్తుంది. అందుకు తగ్గట్టుగా వారి కోసం ప్రస్తుతం స్పెషల్​ ఫండ్​ ను కేటాయించింది.

youtube | యూ ట్యూబ్​
youtube | యూ ట్యూబ్​

 

కాగా యూ ట్యూబ్​ ఇలాంటి షార్ట్​ వీడియోల కోసం దిమ్మతిరిగి పోయే రేంజ్​ లో నిధిని ఏర్పాటు చేసింది. దాదాపు 100 మిలియన్‌ డాలర్లతో ఈ నిధి ఏర్పాటైంది. కాగా 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్‌ వీడియోల క్రియేటర్లకు ఇందులో నుంచి ప్రోత్సాహకాలు అందిచనుంది. ఇలా అందించే రివార్డులకు యూ ట్యూబ్​ ఓ మెలిక పెట్టింది. షార్ట్​ వీడియోలకు వచ్చిన వ్యూస్​ ను ఆధారంగా చేసుకుని రివార్డులను అందిస్తామని వెల్లడించింది.

ఈ నిధిని యూ ట్యూబ్​ భారత్‌ లో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో అందిచనుంది. ఇలా అందిచడం వలన మరింత మంది షార్ట్​ వీడియో క్రియేటర్లు ఆకర్షితులవుతారని కంపెనీ భావిస్తోంది. అంతే కాకుండా యూ ట్యూబ్​ లో సూపర్ థ్యాంక్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్​ సాయంతో క్రియేటర్లు మరింతగా డబ్బును సంపాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news