వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ప్రమేయం ఉంది – సీబీఐ

-

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ప్రమేయం ఉందని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మళ్ళీ విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు కీలక విషయాలు తెలిపారు.

వైఎస్ వివేకా మర్డర్ వెనుక 40 కోట్ల డీల్ జరిగింది, ఎంపీ అవినాష్ ప్రమేయం పై మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. హైకోర్టులో సీబీఐ వాదించింది. గంగాధర్ రెడ్డి 161 స్టేట్మెంట్ లో శివ శంకర రెడ్డి సన్నిహితుడుగా చెప్పాడు.

అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి ల కుటుంబం ప్రమేయం లేకుండా హత్య చేసే అవకాశం లేదు అని శివ శంకర్ రెడ్డి చెప్పాడని సీబీఐ వెల్లడించింది. కేవలం దస్తగిరి స్టేట్మెంట్ మాత్రమే కాదు గంగాధర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా అవినాష్ ప్రమేయం చూపెడుతుందన్నారు సీబీఐ తరఫు న్యాయవాది. ఇక దీనిపై హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news