షాకింగ్: ఏపీలో కుక్కని పెంచుకోవాలంటే లైసెన్స్ కావాల్సిందే

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఏపీలో కుక్కలను కాని పందులను పెంచుకోవాలి అంటే కచ్చితంగా వాటికి లైసెన్స్ తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జిఓ ఎంఎస్ 693 లో పంచాతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు ఇచ్చారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నేడు జీవో విడుదల చేసింది. కుక్కలు, పందులకు లైసెన్స్ లు ఉండాలంటూ… ఆదేశాల్లో స్పష్టం చేసారు.

లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 ఫైన్ తోపాటు రోజుకు రూ.250లు రుసుము వసూలు చేయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఎవరూ వాటి ఓనర్లుగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కులు, పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా తిరిగి లైసెన్స్ పొందాలని పేర్కొంది.

లైసెన్స్ లు పొందే ముందు ఆ కుక్కలు, పందుల యజమానులు వాటి హెల్త్ సర్టిఫికెట్ అందజేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ అందించడం, పందుల విషయంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీచేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ టోకెన్ లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉంచాలని స్పష్టంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news