ప్రధాని మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

-

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జగన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి.

Read more RELATED
Recommended to you

Latest news