YS SHARMILA : పార్టీ ప్రకటించిన షర్మిల… ”వైఎస్సార్ తెలంగాణ పార్టీ” గా నామకరణం

-

అందరూ అనుకున్న సమాయనికే దివంగత ముఖ్యమంత్రి కూతురు వైఎస్ షర్మిల.. కొత్త పార్టీని ప్రకటించారు. “వైఎస్సార్ తెలంగాణ పార్టీ” గా పార్టీకి నామకరణం చేశారు షర్మిల. గ్రాఫిక్స్ రూపంలో పార్టీ అజెండా ప్రకటించారు వైఎస్ షర్మిల. తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వేదిక పై వెళ్ళిన వైఎస్ షర్మిల.. వైఎస్సార్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు. ఆ తర్వాత కొత్త పార్టీని ప్రకటించారు. వైఎస్ షర్మిల ఆవిర్భావ కార్యక్రమానికి కూతురు, కొడుకు, భర్త, బంధువులు హాజరు అయ్యారు. పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత.. సభ వేదికపై వైఎస్ విజయమ్మ మాట్లాడారు. వైఎస్సార్ తరహాలో షర్మిల.. ముందుకు వేళతారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనలో  షర్మిల ముందు ఉంటుందన్నారు.

కాగా ఇవాళ ఉదయం 9 గంటలకు షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌కి నివాళులర్పించారు. 10.30కి ఇడుపుల పాయ నుంచి ఆమె హైదరాబాద్ బయలు దేరారు. మధ్యాహ్నం 1 గంటకి బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి చేరుకోని… బేగంపేట,అమీర్‌పేట, లాల్‌బంగ్లా మీదుగా పంజాగుట్టకి చేరుకున్నారు. అనంతరం జేఆర్సీ సెంటర్‌ల మీదుగా సభా వేదిక వద్దకు చేరుకుని కొత్త పార్టీని ప్రకటించారు వై ఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version