నేటి నుంచే వైయ‌స్ ష‌ర్మిల పాదయాత్ర.. చేవెళ్ళ నుంచి ప్రారంభం

-

వైఎస్‌ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. వైయ‌స్ ష‌ర్మిల “ప్ర‌జా ప్ర‌స్థానం” మ‌హా పాద‌యాత్ర నేడు చేవెళ్ల‌లో మొద‌లు కానుంది. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు చేవెళ్ల‌ లో, శంక‌ర్ ప‌ల్లి క్రాస్ రోడ్డు వ‌ద్ద బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి, 11.30 గంట‌ల‌కు పాద‌యాత్ర మొద‌లు పెట్టనున్నారు వైఎస్‌ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల.

2.5 కిలోమీట‌ర్లు న‌డిచి, మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది ఈ పాదయాత్ర. అక్క‌డ వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, నివాళి అర్పిస్తారు షర్మిలా. అక్క‌డి నుంచి ఒక కిలోమీట‌ర్ దూరంలో ఉన్న కంద‌వాడ గేట్ క్రాస్ వ‌ద్ద‌కు పాద‌యాత్ర చేరుకోనుంది. అక్క‌డ మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు భోజ‌నం చేస్తారు షర్మిలా. తిరిగి సాయంత్రం 3.00గంట‌ల‌కు కంద‌వాడ గేట్ క్రాస్ నుంచి పాద‌యాత్ర మొద‌లవుతుంది. 6.5 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి సాయంత్రం 7.00గంట‌ల‌కు కంద‌వాడ గ్రామానికి చేరుకుంటుంది. తొలి రోజు మొత్తం 10 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news