వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటకి చెప్పి అవమానిస్తున్నారు: వైఎస్ సునీత

-

ఏపీలో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని మొదలు పెట్టేసాయి. కాంగ్రెస్ పార్టీ తరపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కి మద్దతుగా సునీత పులివెందులలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సునీత ప్రజలతో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి ఈ ప్రాంతానికి సేవ చేశారని అన్నారు. వివేక ని అత్యంత దారుణంగా హతమార్చారని న్యాయం కోసం తాము పోరాడుతున్నామని షర్మిల ని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు ని ఆమె కోరారు.

ys sharmila meets sunitha

ప్రజల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని అందరూ చెప్పుకోలేని బాధపడుతున్నారని అన్నారు. పులివెందుల ప్రజలతో పాటు నేను కూడా బాధపడుతున్నానని అన్నారు. ఈ బాధకి ముగింపు మే 13 చెప్పాలని అన్నారు. వివేకానంద రెడ్డిని దారుణంగా చంపించిన వారిని ఓడించాలని ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పాలని అన్నారు. కొంతమంది అయిన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news