అవినాష్ రెడ్డికి బిగ్ షాక్.. వైఎస్ వివేకా హత్య కేసులో పురోగతి !

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినాశ్‍రెడ్డి పెదనాన్న మనవడు అభిషేక్ రెడ్డి వాంగ్మూలాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా సీబీఐ అధికారులు తీసుకున్నారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి చూశానని.. బెడ్‍ రూమ్‍లో మంచం చుట్టూ రక్తం, బాత్‍రూం లో మృత దేహం ఉందని అభిషేక్ రెడ్డి.. సిబిఐ అధికారులకు చెప్పాడు.

వివేకా నుదుటిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని.. వరండాలో అవినాశ్‍రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నారని వెల్లడించారు. శివ శంకర్ రెడ్డి, మనోహర్‍రెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి కూడా అక్కడే ఉన్నారని అభిషేక్ రెడ్డి చెప్పారు.

కానీ గుండెపోటుతో మరణించాడని టీవీల్లో వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు అభిషేక్ రెడ్డి. వైఎస్ వివేకా నంద రెడ్డిని చంపేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. గుండె పోటు అని ఎందుకు ప్రచారం చేశారో నాకు అర్థం కాలేదని ఫైర్ అయ్యారు అభిషేక్ రెడ్డి. 2021 అగస్టు 11న అభిషేక్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేసిన సీబీఐ.. ఇవాళ మరోసారి వాంగ్మూలం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news