వైసీపీలో చేరి తప్పు చేశాను క్షమించాలంటూ పరిటాల సునీత కాళ్లపై పడిన కార్యకర్త

-

మాజీ మంత్రి పరిటాల సునీత కాలపై ఓ కార్యకర్త పడి ప్రాధేయపడ్డాడు. టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం లో పరిటాల సునీత పర్యటించారు.

ఈ సందర్భంగా మచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు… పరిటాల సునీత కాళ్లపై పడ్డారు. అమ్మ వైసీపీలో చేరి తప్పు చేశాను.. నన్ను క్షమించు అమ్మ అంటూ వేడుకున్నారు. వైసీపీలో చేరి తప్పు చేశానని తాను మళ్ళీ టిడిపిలో చేరాలని అనుకుంటున్నారని పేర్కొన్నాడు. తనను మళ్ళీ టిడిపిలో చేర్చుకోవాలని ప్రాధాయపడ్డాడు రామాంజనేయులు. దీంతో అక్కడే టిడిపి కండువా కప్పి టిడిపి సభ్యత్వం కల్పించారు సునీత.

Read more RELATED
Recommended to you

Latest news