అన్న‌మ‌య్య జిల్లాలో దారుణ హ‌త్య‌.. తల నరికి తీసుకెళ్లిన దుండ‌గులు..

-

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసి, తల నరికి, తీసుకువెళ్లిన సంఘటన మదనపల్లి పట్టణంలో మంగళవారం వెలుగు చూసింది. బెంగళూరు రోడ్డులోని తాలిరెడ్డి ఫ్యాక్టరీ వద్ద కొంతమంది వ్యక్తులు మంగళవారం ఉదయం రెండు గంటల సమయంలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపి తలను తీసుకువెళ్లారు.

మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కారం చల్లి మరి అతన్ని చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అమృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news