పశ్చిమ బెంగాల్లో యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారం..

-

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి ఇక ఈ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా.. మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక తాను పోటీ చేస్తున్న లోక్ సభ నియోజకవర్గం బెర్‌హమ్‌పోర్లో ఎన్నికల ప్రచారాన్ని యూసుఫ్ పఠాన్ షురూ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఇక్కడ పెద్ద టీమ్ ఉందని, ఇది (రాజకీయాలు) తనకు భిన్నమైన పిచ్ అని తెలిపారు. ఇక్కడ కూడా వేగంగా రన్స్ సాధించి… గెలిపించాలన్నదే తమ జట్టు లక్ష్యమని పార్టీని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు .తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటు అడుగుతామని పఠాన్ తెలిపారు. అంతేకాకుండా.. 2007 ప్రపంచ కప్‌లో తాను ఆడినట్లు ,ఆ సమయంలో కప్ సాధించి ఎంతో సంతోషపడ్డానో… ఇప్పుడు కూడా అదే సంతోషం… అదే ఉత్సాహంతో ఉన్నానని ఆయన వెల్లడించారు. కాగా.. గుజరాత్ జన్మభూమి అయితే… బెంగాల్ కర్మభూమి అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news