దేశంలో కరోనా కలకలం..కానీ అక్కడ జీరో కేసులు

-

దేశవ్యాప్తంగా మళ్లీ కరుణ కేసులు టెన్షన్ పెడుతున్నాయి. కరుణ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఇప్పుడు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ టెన్షన్ నెలకొని ఉంటే అండమాన్​ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్​ ప్రాంతాల్లో కొత్తగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా వైరస్​ వ్యాప్తి పెరుగుతున్నా.. అరుణాచల్​ ప్రదేశ్​లో గత నాలుగు రోజు నుంచి ఒక్క పాజిటివ్​ కేసు నమోదుకాకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అండమాన్ నికోబార్ దీవిలో కొత్తగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.

 

లెక్కల ప్రకారం చూస్తే అరుణాచల్ ప్రదేశ్​లో ఇప్పటివరకు మొత్తంగా 16,842 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు 16,784 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. అంతేకాక ఈ రాష్ట్రంలో రికవరీ రేటు 99.65 శాతం ఉంది. మరోపక్క అండమాన్​ దీవులకు పర్యటకులు పెరుగుతున్నా ఆ ప్రాంతంలో కొవిడ్​ కేసులు నమోదుకాకపోవడం గమనార్హం. రోజుకు దాదాపుగా 700-800 వరకు పర్యటకులు వస్తున్నా పరిస్థితి అదుపులో ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news