ఐటీ నజర్ ఆన్ వైజాగ్..

-

ఐటీ అధికారుల చూపు వైజాగ్ మీద పడిందని సమాచారం. ఈ నేపథ్యంలోవిశాఖ నగరానికి ఐటీ అధికారులు భారీగా చేరుకోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.   తెలంగాణ, ఒడిశా, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు నగరంలో పలు హోటళ్లలో దిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన గుసగుసలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.  గత కొద్ది కాలంగా  ప్రభుత్వంలోని కీలక నేతలు, వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ అధికారుల హడావుడి చూస్తుంటే మరిన్ని దాడులు తప్పవని తెలుస్తోంది. విశాఖ,గాజువాక, నెల్లూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించేందుకు ఐటీ శాఖ సర్వం సిద్ధం చేసుకుంది . ఇందుకుగాను కేంద్ర నుంచి మొత్తం 5 గ్రూపులు వచ్చినట్లు తెలుస్తోంది.+

Read more RELATED
Recommended to you

Latest news